జైపాల్ రెడ్డి మృతి పట్ల జి. కిషన్ రెడ్డి సంతాపం

జైపాల్ రెడ్డి మృతి పట్ల జి. కిషన్ రెడ్డి  సంతాపం
x
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి వారి పార్థివశరీరానికి (భౌతిక కాయానికి) కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ జి. కిషన్ రెడ్డి , కేంద్ర...

కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి వారి పార్థివశరీరానికి (భౌతిక కాయానికి) కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ జి. కిషన్ రెడ్డి , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి ప్రజల తరఫున తన వాణిని వినిపించి సమస్యలు పరిష్కరించే వారని.. దేశ అభివృద్ధి కోసం వారు చేసిన సేవలు అపూర్వం అని కొనియాడారు. ఈ కష్ట సమయంలో శ్రీ జైపాల్ రెడ్డి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఒక గొప్ప పార్లమెంటేరియన్ కోల్పోయాం. రాష్ట్ర కేంద్ర రాజకీయాలలో శ్రీ జైపాల్ రెడ్డి గారి సుస్థిర స్థానం. విద్యార్థి నాయకుడిగా ఉంటూ రాజకీయాల్లో చేరి ఉన్నత స్థానానికి చేరిన వ్యక్తి. శ్రీ సూదిని జైపాల్ రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని సానుభూతి తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతిని కలిగించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం అని అన్నారు.

జైపాల్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు హైదరాబాద్ లోని జైపాల్‌రెడ్డి స్వగృహం నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సందర్శకుల దర్శనార్థం గాంధీభవన్‌లో మాధ్యాహ్నం వరకు పార్థీవదేహాన్ని అక్కడే ఉంచుతారు. పీవీ ఘాట్‌ పక్కన అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories