మేఘాల కారణంగా గ్రహణాన్ని సంపూర్ణంగా చూడలేకపోయా: మోదీ

మేఘాల కారణంగా గ్రహణాన్ని సంపూర్ణంగా చూడలేకపోయా: మోదీ
x
మోదీ
Highlights

ఉదయం 8 గంటల 8 నిమిషాలకు ప్రారంభమైన సూర్యగ్రహణం..11 గంటల11నిమిషాలకు వీడింది. మూలా నక్షత్రం ధనుస్సు రాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాదిలో ఇది మూడో...

ఉదయం 8 గంటల 8 నిమిషాలకు ప్రారంభమైన సూర్యగ్రహణం..11 గంటల11నిమిషాలకు వీడింది. మూలా నక్షత్రం ధనుస్సు రాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాదిలో ఇది మూడో సూర్యగ్రహణం. మూడు గంటలకుపైగా గ్రహణం కొనసాగింది. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్‌, సౌదీ, సింగపూర్‌ దేశాల్లో సూర్యగ్రహణం కనిపించింది.

సూర్యగ్రహణాన్ని ప్రధాని మోదీ వీక్షించారు. ప్రస్తుతం కేరళలోని కోజికోడ్ లో ప్రధాని ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఎంతో మంది భారతీయుల మాదిరే తాను కూడా ఉత్సాహంగా గ్రహణాన్ని వీక్షించానని చెప్పారు. అయితే, మేఘాల కారణంగా గ్రహణాన్ని సంపూర్ణంగా చూడలేకపోయానని తెలిపారు. గ్రహణం గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories