ఔను.. ఆ ఇద్దరి పెళ్లి ఆగిపోయింది..

ఔను.. ఆ ఇద్దరి పెళ్లి ఆగిపోయింది..
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ఔను వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. అన్ని ప్రేమ జంటలలాగే వారూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఒకరికొకరు జీవితాంతం కలిసుందాం అనుకున్నారు. కానీ అన్ని...

ఔను వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. అన్ని ప్రేమ జంటలలాగే వారూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఒకరికొకరు జీవితాంతం కలిసుందాం అనుకున్నారు. కానీ అన్ని ప్రేమకథల్లో లాగానే వారి ప్రేమకథలోనూ అవాంతరం ఎదురైంది, ఆ పెళ్లి ఆగిపోయింది.

అన్ని ప్రేమ కథల్లోనూ ఇదే ఉంటుంది అనుకుంటున్నారు కాదా. కానీ ఈ పెళ్లి ఆగిపోవడానికి అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అది ఏంటో తెలుసా..ప్రేమించుకున్నది ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కాదు. ఇద్దరూ అబ్బాయిలే. ఇదేంటి కలికాలం అనుకుంటున్నారా కానీ అది నిజం..

ఈ విచిత్రమైన సంఘటన గురించిన పూర్తి వివరాల్లోకెళితే సూర్యాపేట జిల్లా ఇమాంపేటకు చెందిన మునగాల జానయ్య అనే యువకుడు ఉద్యోగం చేస్తూ తన జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే సూర్యాపేటకు చెందిన మరో యువకుడు గుండ్లగాని సాయితో జానయ్యకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఆ ఇద్దరు యువకులు పెద్దలను ఎదిరించైనా సాహసం చేసి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.

ఇప్పటివరకూ అంతా బాగానే ఉంది కానీ జానయ్య మహిళగా మారితేనే పెళ్లి చేసుకుంటానని సాయి లిటికేషన్ పెట్టాడు. దీంతో జానయ్య ఎలాగయినా సాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుని లింగమార్పిడి చేయించుకున్నాడు. జానయ్య తీరా మహిళగా మారిన తర్వాత సాయి సడంగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో మహిళగా మారిన జానయ్య పోలీసులను ఆశ్రయించారు. ఒక అమ్మాయి, అబ్బాయి కేసులను సర్ధుమనిగించిన పోలీసులకు ఇప్పుడు ఈ పంచాయితీని ఎలా సర్దుమనిగించాలో తెలీక తలల పట్టుకున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories