దిశ కేసులో కీలక మలుపు... నిందితుల్లో ఇద్దరు మైనర్లు ?

దిశ కేసులో కీలక మలుపు... నిందితుల్లో ఇద్దరు మైనర్లు ?
x
దిశ కేసు
Highlights

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో కొత్తకోణం ఒకటి వెలుగు చూసింది. ఎన్‌కౌంటర్‌లో హతమైన ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ వయసు 26 ఏళ్లు అని, జొల్లు శివ, జొల్లు...

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో కొత్తకోణం ఒకటి వెలుగు చూసింది. ఎన్‌కౌంటర్‌లో హతమైన ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ వయసు 26 ఏళ్లు అని, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవుల వయసు 20 ఏళ్లని పోలీస్ కమిషనర్ తెలిపారు. అయితే, పోలీసులు చెబుతున్నట్టు దాంట్లో నిజం లేదని, నిందితుల్లో ఇద్దరు మైనర్లని వారి పుట్టిన రోజు తేదీలను బట్టి తెలుస్తోంది. ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘం విచారణ బృందానికి తెలియజేసినట్టు సమాచారం.

ఈ మేరకు నిందితుల ఆధార్ కార్డులు, స్కూల్‌ బోనఫైడ్ సర్టిఫికెట్లను అధికారులు సేకరించారు. వాటి ప్రకారం ఓ నిందితుడి పుట్టిన రోజు ఆగస్టు 15, 2002. దాని ప్రకారం అతడి వయసు 17 సంవత్సరాల ఆరు నెలలు. అయితే, ఆధార్‌కార్డులో మాత్రం 2001గా నమోదైంది. మరో నిందితుడి పుట్టిన తేదీ ధ్రువపత్రంలో 10 ఏప్రిల్ 2004గా ఉంది. అంటే అతడి వయసు 15 సంవత్సరాల 8 నెలలు మాత్రమే. దీంతో నిందితుల వయసుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories