ఇంజనీరింగ్ విద్యార్థి మిస్సింగ్‌ మిస్టరీ.. గదిలో బ్లేడ్లు, విద్యార్థి దుస్తులపై రక్తపు మరకలు

ఇంజనీరింగ్ విద్యార్థి మిస్సింగ్‌ మిస్టరీ.. గదిలో బ్లేడ్లు, విద్యార్థి దుస్తులపై రక్తపు మరకలు
x
Highlights

మేడ్చల్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో జీవన్‌రెడ్డి అనే విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న జీవన్‌రెడ్డి కాలేజ్...

మేడ్చల్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో జీవన్‌రెడ్డి అనే విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న జీవన్‌రెడ్డి కాలేజ్ సమీపంలోని హరిహర బాయ్స్ హాస్ట్‌లో ఉంటున్నాడు. రెండు రోజులుగా జీవన్‌రెడ్డి కనిపించకపోవడంతో కలకలం రేగింది. జీవన్‌రెడ్డి కనిపించడం లేదంటూ అతడి తల్లిదండ్రులకు ఈనెల11న హాస్టల్ సిబ్బంది సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్ గదికి వచ్చి పోలీసులు అంతా పరిశీలించారు. గదిలో బ్లేడ్లు, జీవన్‌రెడ్డి దుస్తులపై రక్తపు మరకలు కనిపించాయి. దీంతో జీవన్‌రెడ్డి తల్లిదండ్రుల్లో ఆందోళన కనిపిస్తోంది. అయితే రూంమేట్స్‌తో జీవన్‌రెడ్డికి గొడవ అయ్యిందని ఆ తరువాత నుంచే జీవన్‌రెడ్డి కనిపించడం లేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా విద్యార్థి జీవన్‌రెడ్డి మూడు రోజులుగా ఎవరితో మాట్లాడకుండా ఉండటం గమనించినట్లు హాస్టల్‌ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో అప్పు తీసుకునేవాడని అప్పు చెల్లించకపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం 10 గంటలకు కిందికి వచ్చి మళ్లీ పైకి వెళ్లిపోయాడని ఆ తర్వాత బయటకురాలేదని హాస్టల్‌ యజమాని పేర్కొన్నాడు. అయితే బాత్‌రూమ్‌లో రక్తపు మరకలు కొంత అనుమానానికి రేకెత్తిస్తున్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories