ఒక్క ఆటోలో 24 మంది ప్రయాణికులు...పోలీసులు షాక్..

ఒక్క ఆటోలో 24 మంది ప్రయాణికులు...పోలీసులు షాక్..
x
Highlights

కరీంనగర్‌లో ఓ ఆటోలో 24 మంది ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆటోలో ఏడుగురికి మించకుండా ఎక్కించుకోవాల్సిన డ్రైవర్ 24 మందిని ఎక్కాంచాడు....

కరీంనగర్‌లో ఓ ఆటోలో 24 మంది ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆటోలో ఏడుగురికి మించకుండా ఎక్కించుకోవాల్సిన డ్రైవర్ 24 మందిని ఎక్కాంచాడు. ఓవర్ లోడ్ తో వెళ్తున్న ఆటోను గమనించిన పోలీసులు తనిఖీ చేయగా పిల్లలతో కలిసి 24 మంది ఉన్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. అబ్దుల్ అనే ఓ ఆటోడ్రైవర్ తన వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిమ్మాపూర్ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మార్గమధ్యలో అతన్ని ఆపిన పోలీసులు అతని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత ఆటోలో ఉన్న ప్రయాణికుల సంఖ్యను చూసి పోలీసులు షాకయ్యారు. మహిళలు, పిల్లలు కలిపి మొత్తం 24 మంది ఆ ఆటోలో ప్రయాణిస్తున్నారు. దీంతో లెక్కకు మించి అంతమందిని ఆటోలో ఎందుకు ఎక్కించుకున్నావని పోలీసులు అబ్దుల్‌కు క్లాస్ పీకారు. ఈ క్రమంలో ఆ ఘటనను వీడియో తీసి ట్విట్టర్‌లోనూ పోస్ట్ చేశారు. కాగా ఆ వీడియోను కరీంనగర్ సీపీ వి.బి.కమలాసన్ రెడ్డి ట్విట్టర్‌లో షేర్ చేయగా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories