కరీంనగర్లో ఓ ఆటోలో 24 మంది ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆటోలో ఏడుగురికి మించకుండా ఎక్కించుకోవాల్సిన డ్రైవర్ 24 మందిని ఎక్కాంచాడు....
కరీంనగర్లో ఓ ఆటోలో 24 మంది ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆటోలో ఏడుగురికి మించకుండా ఎక్కించుకోవాల్సిన డ్రైవర్ 24 మందిని ఎక్కాంచాడు. ఓవర్ లోడ్ తో వెళ్తున్న ఆటోను గమనించిన పోలీసులు తనిఖీ చేయగా పిల్లలతో కలిసి 24 మంది ఉన్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. అబ్దుల్ అనే ఓ ఆటోడ్రైవర్ తన వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిమ్మాపూర్ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మార్గమధ్యలో అతన్ని ఆపిన పోలీసులు అతని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత ఆటోలో ఉన్న ప్రయాణికుల సంఖ్యను చూసి పోలీసులు షాకయ్యారు. మహిళలు, పిల్లలు కలిపి మొత్తం 24 మంది ఆ ఆటోలో ప్రయాణిస్తున్నారు. దీంతో లెక్కకు మించి అంతమందిని ఆటోలో ఎందుకు ఎక్కించుకున్నావని పోలీసులు అబ్దుల్కు క్లాస్ పీకారు. ఈ క్రమంలో ఆ ఘటనను వీడియో తీసి ట్విట్టర్లోనూ పోస్ట్ చేశారు. కాగా ఆ వీడియోను కరీంనగర్ సీపీ వి.బి.కమలాసన్ రెడ్డి ట్విట్టర్లో షేర్ చేయగా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
People should take care of their own safety. They shouldn't board in overcrowded passenger autos unmindful of their safety pic.twitter.com/Aul2l2LM7C
— CP KARIMNAGAR (@cpkarimnagar) August 11, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire