29వ రోజు కొనసాగుతోన్న ఆర్టీసీ సమ్మె..పలు కీలక అంశాలపై చర్చించనున్న సీఎం కేసీఆర్

Tsrtc Strike
x
Tsrtc Strike
Highlights

ఆర్టీసీ సమ్మె 29వ రోజు కొనసాగుతోంది. ఇవాళ అన్ని డిపోల వద్ద జేఏసీ పిలుపు మేరకు నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు విపక్ష పార్టీలతో ఆర్టీసీ...

ఆర్టీసీ సమ్మె 29వ రోజు కొనసాగుతోంది. ఇవాళ అన్ని డిపోల వద్ద జేఏసీ పిలుపు మేరకు నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు విపక్ష పార్టీలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 30 కీలక అంశాలపై చర్చించనున్నారు. ఆర్టీసీ పాలసీని సమూలంగా మార్చే విధంగా కేబినెట్ నిర్ణయం ఉండబోతోందని తెలుస్తోంది. ప్రైవేటు బస్సులు, ప్రైవేట్ రూట్లపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories