కాసేపట్లో గవర్నర్‌ తమిళిసైని కలవనున్న ఆర్టీసీ జేఏసీ నేతలు

కాసేపట్లో గవర్నర్‌ తమిళిసైని కలవనున్న ఆర్టీసీ జేఏసీ నేతలు
x
Highlights

ఆర్టీసీ జేఏసీ నాయకులు కాసేపట్లో గవర్నర్‌ తమిళిసైని కలవనున్నారు. తాము చేస్తున్న సమ్మెపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం....

ఆర్టీసీ జేఏసీ నాయకులు కాసేపట్లో గవర్నర్‌ తమిళిసైని కలవనున్నారు. తాము చేస్తున్న సమ్మెపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. జీతాల చెల్లింపుపై కూడా మాట్లాడే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క హైకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంపై ఆర్టీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపుపై హైకోర్టులో విచారణ జరిగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఆర్టీసీ దగ్గర కేవలం 7 కోట్ల 50 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కార్మికులకు జీతాలు చెల్లించడానికి 224 కోట్లు కావాలని కోర్టుకు విన్నవించారు. ఆర్టీసీ కార్మికులు అక్టోబర్‌లో సమ్మెకు దిగడంతో ప్రభుత్వం సెప్టెంబర్ నెల జీతాలు నిలిపివేసింది. దీంతో కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కార్మికుల సమ్మె 17వ రోజు కొనసాగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories