త్వరలో అంతర్రాష్ట్ర బస్సులు : సర్వీసులపై కసరత్తు

త్వరలో అంతర్రాష్ట్ర బస్సులు : సర్వీసులపై కసరత్తు
x
Highlights

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన అంతరాష్ట్ర సర్వీసులు నిలిచిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆర్టీసీ సంస్థ ఈ అంతర్రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించేందుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నది.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన అంతరాష్ట్ర సర్వీసులు నిలిచిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆర్టీసీ సంస్థ ఈ అంతర్రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించేందుకు కసరత్తు ముమ్మరం చేస్తున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ర్టాల రోడ్డు రవాణాశాఖలకు లేఖలు రాసింది. ఏపీతో కొన్ని సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున వాటిపై స్పష్టత కోసం అధికారులు వేచి చూస్తున్నారు. అక్కడి రోడ్డు రవాణాశాఖ నుంచి సుముఖత వ్యక్తంకాగానే బస్సులు పునరుద్ధరిస్తారు.

ఇక పోతే మొన్నటి వరకు ఏపీ బస్సులు మన రాష్ట్రంలో 900కిలో మీటర్ల మేర నడుస్తుండగా తెలంగాణ సర్వీసులు 700 కిలోమీటర్లే తిరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఎపీ, తెలంగాణకు వ్యత్యాసం లేకుండానే రెండువైపులా సమానంగా బస్సు సర్వీసులు నడుపాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో స్పష్టమైన ఒప్పందం తర్వాతే సర్వీసులను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే బస్సు సర్వీసులకు ఎంత మేర సర్వీసులు పెంచాలని, చర్చలు మంత్రుల స్థాయిలోనా? ముఖ్యకార్యదర్శులతో జరిపారు. అనే అంశంలో ప్రభుత్వ అనుమతి కోసం అధికారులు వేచి చూస్తున్నట్టు సమాచారం. ఇక కర్ణాటకలో ప్రధానంగా బెంగుళూరు, రాయిచూరుకు తెలంగాణ నుంచి ఎక్కువ బస్సు సర్వీసులు నడుస్తాయి. కర్ణాటకకు సంబంధించి సాంకేతిక ఇబ్బందులు లేవు అని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories