55 మంది ఎక్కాల్సిన బస్సులో 125 మందితో ప్రయాణం...చివరికి..

55 మంది ఎక్కాల్సిన బస్సులో 125 మందితో ప్రయాణం...చివరికి..
x
Highlights

కోరుట్ల ఆర్టీసీ డిపో బస్సును రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. 55 మందితో వెళ్లాల్సిన బస్సులో 125 మంది ప్రయాణీకులను ఎక్కించినట్టు గుర్తించిన రవాణా...

కోరుట్ల ఆర్టీసీ డిపో బస్సును రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. 55 మందితో వెళ్లాల్సిన బస్సులో 125 మంది ప్రయాణీకులను ఎక్కించినట్టు గుర్తించిన రవాణా అధికారులు బస్సును సీజ్ చేశారు. అక్కడికక్కడే ప్రయాణీకులను దించేసి బస్సును సీజ్ చేశారు. కొండగట్టు ప్రమాదం జరిగిన తరువాత కూడా ఆర్టీసీ అధికారులు తీరు మారక పోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆ తర్వాత బస్సును కొడిమ్యాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉన్నా బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్ధానికులు ఆరోపిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories