అమ్మవారికి గవర్నర్‌ దంపతుల ప్రత్యేక పూజలు

అమ్మవారికి గవర్నర్‌ దంపతుల ప్రత్యేక పూజలు
x
Highlights

తెలంగాణ గవర్నర్‌ తమిళి సై దీపావళి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పాతబస్తి చార్మినార్‌ దగ్గరున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని తమిళిసై దంపతులు...

తెలంగాణ గవర్నర్‌ తమిళి సై దీపావళి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పాతబస్తి చార్మినార్‌ దగ్గరున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని తమిళిసై దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. తర్వాత భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళిసై దంపతులకు పండితులు వేదాశీర్వచనం అందజేశారు.

దీపావళి సందర్భంగా భాగ్యనగరం కొత్త రూపు సంతరించుకుంది. అమ్మవారి ఆలయాలు విద్యుత్ వెలుగుల మధ్య అలరాడుతున్నాయి. పాతబస్తీలోని భాగ్య నగరం ఆలయం దగ్గర తెల్లవారుజాము నుంచే భక్తులు రాక ప్రారంభమయ్యింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో కోలాహలం నెలకొంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories