ఘనంగా టీఅరెస్ జిల్లకార్యాలయాల శంకుస్థాపన

ఘనంగా టీఅరెస్ జిల్లకార్యాలయాల శంకుస్థాపన
x
Highlights

ప్రతి జిల్లాలోనూ టీఅరెస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భాగంగా రాష్ట్రంలోని 29 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి...

ప్రతి జిల్లాలోనూ టీఅరెస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భాగంగా రాష్ట్రంలోని 29 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మండలి సభ్యులు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, పార్టీ నేతలు, కార్యకర్తలతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీఅరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ సిరిసిల్ల జిల్లాలో పార్టీ కార్యాలయ భవన భూమి పూజలో పాల్గొన్నారు. ఇక తొమ్మది జిల్లాల్లో మంత్రులు, పంతొమ్మిది జిల్లాల్లో జడ్పీ ఛైర్‌పర్సన్లు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాల తరువాత సమావేశాలు నిర్వహించారు.

మహబూబ్‌నగర్‌లో కార్యాలయ భవనానికి ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ శంకుస్థాపన చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, సాట్స్‌ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా డి.పోచంపల్లిలో భవన నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, తెరాస యువజన విభాగం రాష్ట్రాధ్యక్షుడు శంభీపూర్‌రాజు భూమిపూజ చేశారు. ఎమ్మెల్యేలు కేపీవివేకానంద్‌, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, యెగ్గె మల్లేశం, నవీన్‌రావు, ఎంబీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌, నూతనంగా ఎన్నికైన జడ్పీ ఛైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, ప్రస్తుత జడ్పీ ఛైర్‌పర్సన్‌ బండారి భాస్కర్‌, నూతన జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత పాల్గొన్నారు. మెదక్‌ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి జడ్పీ ఛైర్‌పర్సన్‌ హేమలత శేఖర్‌గౌడ్‌, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి భూమిపూజ చేశారు. నిర్మల్‌లో దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పాల్గొన్నారు. జనగామలో పార్టీ భవన నిర్మాణానికి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మిషన్‌ భగీరథ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్‌ బి.వెంకటేశ్వర్లు, స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే టి.రాజయ్య, జనగామ జడ్పీ ఛైర్‌పర్సన్‌ పాగాల సంపత్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఎడవెల్లి కృష్ణారెడ్డి, కొమురవెల్లి ఆలయ ఛైర్మన్‌ సంపత్‌ పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కార్యాలయ భవనానికి జడ్పీ ఛైర్‌పర్సన్‌ వనజమ్మ శంకుస్థాపన చేయగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి, కరీంనగర్‌ జిల్లాలో ఈటల రాజేందర్‌, నిజామాబాద్‌లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, జగిత్యాలలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌లు శంకుస్థాపనల్లో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories