రేపు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

రేపు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
x
Highlights

రేపు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో భేటీ కానున్నారు. ఈనెల 17నుంచి పార్లమెంట్ సమావేశాలు...

రేపు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో భేటీ కానున్నారు. ఈనెల 17నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. భేటీకి హాజరుకావాలంటూ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్‌ పార్లమెంట్‌ వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు వీరే.. పి. రాములు(నాగర్‌కర్నూల్), మన్నె శ్రీనివాస్ రెడ్డి(మహబూబ్‌నగర్), మాలోత్ కవిత(మహబూబాబాద్), నామా నాగేశ్వర్‌రావు(ఖమ్మం), రంజిత్ రెడ్డి(చేవెళ్ల), బీబీ పాటిల్(జహీరాబాద్), పసునూరి దయాకర్(వరంగల్), కొత్త ప్రభాకర్ రెడ్డి(మెదక్), నేతకాని వెంకటేశ్(పెద్దపల్లి).

Show Full Article
Print Article
More On
Next Story
More Stories