కేసీఆర్ హవా ముందు ఎవరూ నిలవలేరు..50వేల మెజార్టీ పక్క..

కేసీఆర్ హవా ముందు ఎవరూ నిలవలేరు..50వేల మెజార్టీ పక్క..
x
Highlights

ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితాలు దీనికి నిదర్శనమన్నారు. 50...

ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితాలు దీనికి నిదర్శనమన్నారు. 50 వేల మెజార్టీ దాటుతుందని అన్నారు సైదిరెడ్డి. ఈ విజయానికి కేసీఆర్ హవానే కారణమన్నారు. కేసీఆర్ హవా ముందు ఎవరూ నిలవలేరని అన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, కేవలం మాటలతో ప్రజలను మభ్యపెట్టారని సైదిరెడ్డి విమర్శించారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 7 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. అధికార టీఆరెస్ పార్టీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏడో రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. ఏడో రౌండ్‌ పూర్తయ్యేసరికి సైదిరెడ్డికి 14,300 ఓట్ల మెజార్టీ వచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories