తెలంగాణలో తహశీల్దార్‌ల బదిలీలు

తెలంగాణలో తహశీల్దార్‌ల బదిలీలు
x
Highlights

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రభుత్వం తహశీల్దార్లను భారీ స్థాయిలో బదిలీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు బదిలీ అయిన 378 మంది తహశీల్దార్‌లను...

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రభుత్వం తహశీల్దార్లను భారీ స్థాయిలో బదిలీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు బదిలీ అయిన 378 మంది తహశీల్దార్‌లను మళ్లీ వాళ్ల యథా స్థానానికే బదిలీ చేస్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహశీల్దార్‌లు వారిని తమ స్థానాలకు బదిలీ చేయాలంటూ కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్న సంగతి అందరికీ విదితమే. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వ రంగం సిద్ధం అవుతున్న నేపధ్యంలోనే ఈ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. ఈ వార్త వినడంతో తమ యథాస్థానాలకు వెళుతున్నామనే ఆనందంలో తహశీల్దార్లు ఉన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories