రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు
x
Highlights

ఆడియో రిలీస్ ఫంక్షన్ కి వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెంది, నలుగురు గాయాలపాలైన సంఘటన సిద్ధిపేట జిల్లలో చోటు చేసుకుంది.

ఆడియో రిలీస్ ఫంక్షన్ కి వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెంది, నలుగురు గాయాలపాలైన సంఘటన సిద్ధిపేట జిల్లలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధిపేట జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

మానుకొండూరు మండలం వేగురుపల్లికి చెందిన ఏడుగురు వ్యక్తులు హైదరాబాద్‌లో ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌కి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఇదే సమయంలో ప్రజ్ఞాపూర్‌ రాజీవ్‌ జాతీయ రహదారిపై ఆగివున్న కంటెయినర్‌ను వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో వేగురుపల్లికి చెందిన మల్లేశం(35), జనార్దన్‌ రెడ్డి(50), ప్రభాకర్‌ రెడ్డి(50)గా ఉన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించినట్టు పోలీసులు తెలిపారు. వీరితో పాటు ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని సమీపంలోని చికిత్స నిమితం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధరించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories