భద్రాద్రిలో 5.5 కేజీల శిశువు జననం : తల్లీ బిడ్డా క్షేమం

భద్రాద్రిలో 5.5 కేజీల శిశువు జననం : తల్లీ బిడ్డా క్షేమం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

సాధారణంగా శిశువులు 3 నుంచి 4 కేజీల మధ్యలో జన్మిస్తూ ఉంటారు. కానీ భద్రాచలంలోని చర్చి రోడ్డులో ఉన్న జీవన్‌ వైద్యశాలలో ఓ చిన్నారి గురువారం 5.5 కేజీల...

సాధారణంగా శిశువులు 3 నుంచి 4 కేజీల మధ్యలో జన్మిస్తూ ఉంటారు. కానీ భద్రాచలంలోని చర్చి రోడ్డులో ఉన్న జీవన్‌ వైద్యశాలలో ఓ చిన్నారి గురువారం 5.5 కేజీల బరువుతో సంపూర్ణ ఆరోగ్యంతో జన్మించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన జట్టి సంధ్య కాన్పు కోసం జీవన్‌ వైద్యశాలలో చేరింది. అక్కడ ఆమెని పరీక్షించిన వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. కాగా ఆమె 5.5 కేజీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే గురువారం జన్మించిన ఈ శిశువు సాధారన బరువుకంటే కూడా ఎక్కువగా ఉండడం గమనార్హం.

ఇక ఇదే తరహాలో గతంలో హైదరాబాద్ నగరంలోని నీలోఫర్‌ ఆసుపత్రిలో కూడా ఓ బాబు 6 కేజీల బరువుతో జన్మించాడు. తాజాగా భద్రాద్రిలో 5.5 కేజీల బాబు జన్మించడం రెండో రికార్డుగా నమోదైంది. మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మించిన సంధ్య, రెండో కాన్పులో బాబుకు జన్మనిచ్చింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories