చర్లపల్లి జైల్ వద్ద భారీ బందోబస్తు

చర్లపల్లి జైల్ వద్ద భారీ బందోబస్తు
x
Highlights

దిశ హత్య కేసు నిందితులు చర్లపల్లి జైల్‌లో ఉండటంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైల్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిరసనలు,...

దిశ హత్య కేసు నిందితులు చర్లపల్లి జైల్‌లో ఉండటంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైల్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కస్టడీకి తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనే దానిపై అప్రమత్తమయ్యారు. అవసరమైతే జైల్‌లోనే ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించే అవకాశం ఉంది.

దిశ హత్య కేసు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలనే పోలీసుల పిటిషన్ పై షాద్‌నగర్‌ కోర్టులో విచారణ జరగనుంది. నిందితులను లోతుగా విచారించేందుకు వారిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దిశ మొబైల్ ను రికవరీ చేయాలని, నిందితుల స్టేట్ మెంట్లను రికార్డు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను షాద్‌నగర్ కోర్టు విచారించనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories