టీఆర్ఎస్ పార్టీ మళ్లీ విజయకేతనాన్ని ఎగరవేసింది. రాష్ట్రంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) పదవులను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
టీఆర్ఎస్ పార్టీ మళ్లీ విజయకేతనాన్ని ఎగరవేసింది. రాష్ట్రంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) పదవులను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. శనివారం డీసీసీబీ, డీసీఎంఎస్ల ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించగా విపక్షాలను చిత్తుగా ఓడించి టీఆర్ఎస్ తన సత్తా చాటింది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 9 డీసీసీబీ, డీసీఎంఎస్లను అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక పోతే ఈ ఎన్నికల్లో తమ అనుచరులకు అవకాశం కల్పించడం కోసం చాలా చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంతో కృషి చేసారు. దాంట్లో ముఖ్యంగా వరంగల్ జిల్లా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది.
జిల్లాల వారీగా ఎన్నికైన ఛైర్మన్ల జాబితాను చూసుకుంటే ..
♦ ఆదిలాబాద్ జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ పదవికి తిప్పని లింగయ్య, వైస్ ఛైర్మన్ పదవికి కొమురం మాంతయ్య ఎన్నికయ్యారు. అదే విధంగా డీసీసీబీ ఛైర్మన్ పదవికి నాందేవ్ కాంబ్లే, వైస్ ఛైర్మన్ పదవికి రఘునందన్ రెడ్డి ఎన్నికయ్యారు.
♦ నిజామాబాద్ జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ పదవికి సాంబారి మోహన్, వైస్ ఛైర్మన్ పదవికి ఏదుల్లా ఇంద్రాసేనా రెడ్డి ఎన్నికయ్యారు. అదే విధంగా డీసీసీబీ ఛైర్మన్ పదవికి భాస్కర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ పదవికి రమేశ్ రెడ్డి ఎన్నికయ్యారు.
♦ కరీంనగర్ జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ పదవికి శ్రీకాంత్ రెడ్డి, వైస్ ఛైర్మన్ పదవికి ఫకృద్దీన్ ఎన్నికయ్యారు. అదే విధంగా డీసీసీబీ ఛైర్మన్ పదవికి కొండూరు రవీందర్ రావు, వైస్ ఛైర్మన్ పదవికి పింగళి రమేశ్ ఎన్నికయ్యారు.
♦ వరంగల్ జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ పదవికి గుగులోతు రామస్వామి నాయక్, వైస్ ఛైర్మన్ పదవికి డి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. డీసీసీబీ ఛైర్మన్ పదవికి మార్నేని రవీందర్, వైస్ ఛైర్మన్ పదవికి కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు.
♦ ఖమ్మం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ పదవికి రాయల వెంకటశేషగిరి రావు, వైస్ ఛైర్మన్ పదవికి కొత్వాల్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీసీబీ ఛైర్మన్ పదవికి కురాకుల నాగభూషణం, వైస్ ఛైర్మన్ పదవికి దొండపాటి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.
♦ మహబూబ్నగర్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పదవికి ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ పదవికి హర్యానాయక్ ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీసీబీ ఛైర్మన్ పదవికి నిజాం పాషా, వైస్ ఛైర్మన్ పదవికి వెంకటయ్య ఎన్నికయ్యారు.
♦ నల్గొండ జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ పదవికి వట్టి జానయ్య యాదవ్, వైస్ ఛైర్మన్ పదవికి డి నారాయణ రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీసీబీ ఛైర్మన్ పదవికి గొంగిడి మహేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ పదవికి ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.
♦ మెదక్ జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ పదవికి శివకుమార్, వైస్ ఛైర్మన్ పదవికి రమేశ్ కుమార్ ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీసీబీ ఛైర్మన్ పదవికి దేవేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ పదవికి పట్నం మాణిక్యం ఎన్నికయ్యారు.
♦ రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ పదవికి కృష్ణారెడ్డి, వైస్ ఛైర్మన్ పదవికి మధుకర్ రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీసీబీ ఛైర్మన్ పదవికి బి మనోహర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ పదవికి సత్తయ్య ఎన్నికయ్యారు.
డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు), డీసీఎంఎస్ (జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం. రాష్ట్రంలోని 9 డీసీసీబీ, డీసీఎంఎస్ ల చైర్మన్, వైస్చైర్మన్ లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు. pic.twitter.com/sgb7QR70fC
— TRS Party (@trspartyonline) February 29, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire