పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ను త్వరలో ప్రకటిస్తాం..

పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ను త్వరలో ప్రకటిస్తాం..
x
Highlights

కరోనా వైరస్ ప్రభావంతో తెలంగాణలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ప్ర‌క‌టించింది. మార్చి 19న...

కరోనా వైరస్ ప్రభావంతో తెలంగాణలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షల తేదీలను త్వరలోనే వెల్లడి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ప్ర‌క‌టించింది. మార్చి 19న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు 22 వరకు జరిగాయి. ఆ తరువాత రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో మార్చి 23 నుంచి 29 వరకు జరగాల్సిన పరీక్షలను హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసారు.

కాగా మిగిలిన పరీక్షలను మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 6 వరకు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపినప్పటికీ రాష్ట్రంలో లాక్ డౌన్ ఉన్నందున పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్‌డౌన్ ఉన్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఏ. సత్యనారాయణ రెడ్డి సోమవారం వెల్ల‌డించారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలతో పాటు వాయిదా పడిని మిగతా అన్ని పరీక్షలకు రీ షెడ్యూల్ తేదీల‌ను త‌ర్వ‌లోనే తెలుపుతామని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories