Etela Rajender: తెలంగాణలో ఆగని కరోనా కేసులు..

Etela Rajender: తెలంగాణలో ఆగని కరోనా కేసులు..
x
Highlights

తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కు 47 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికే...

తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కు 47 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికే ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిందన్నారు. కరోనా బారిన పడిన వారెవరూ విషమ పరిస్థితిలో లేరని ప్రకటించారు. శుక్రవారం కోఠిలోనికమాండ్‌ కంట్రోల్‌రూమ్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ప్రైవేట్‌ కాలేజీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి ఈటల ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులను వాడుకుంటున్నామని రెండో దశలో ప్రైవేట్‌ వైద్య కళాశాలలను వాడుకునేందుకు వారిని కోరామన్నారు.

కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రైవేట్‌ వైద్య కళాశాలలు సిద్దంగా ఉన్నాయని అన్నారు. తాజాగా మరో రెండు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులను డాక్ట‌ర్లు నిర్థారించారని చెప్పారు ఈట‌ల రాజేంద‌ర్. దీంతో తెలంగాణ కరోనా కేసుల సంఖ్య 47కి చేరిందన్నారు. రాష్ట్రంలో వైరస్‌ వెలుగుచూసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories