తెలంగాణ మున్సిపల్ శాఖ వార్షిక ప్రగతి రిపోర్ట్ విడుదల

తెలంగాణ మున్సిపల్ శాఖ వార్షిక ప్రగతి రిపోర్ట్ విడుదల
x
Highlights

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్...

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా పురపాలక శాఖ తరఫున చేపట్టిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పురోగతిని వివరించారు. పట్టణాలు పురోగతి సాధించేందుకు ప్రతి పౌరుడు ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తుందని మంత్రి అన్నారు. పట్టణాల్లో ప్రజలకు అవసరం అయిన ప్రాథమిక సౌకర్యాలపైన ప్రస్తుతం తమ దృష్టి ఉన్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను చేపట్టిందని ఆయన తెలిపారు. పట్టణాలన్నింటిని ప్రజలు జీవించేందుకు అనుకూలంగా లివబుల్, లవబుల్ సిటీలుగా మార్చాలన్నా బృహత్తరమైన, దీర్ఘకాలిక లక్ష్యంతో తెలంగాణ పురపాలక శాఖ పని చేస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ పురపాలక శాఖ రూపొందించిన ప్రగతి నివేదిక లోని కీలకమైన అంశాలు:

టీడీఆర్ పాలసీ... టిడిఆర్ పాలసీని ప్రోత్సాహించడం ద్వారా జీహెచ్ఎంసీలోని అభివృద్ధి పనులకు, రోడ్డు విస్తరణ, ఇతర పనులకు కావలసిన ఆస్దుల సేకరణ మరింత తేలికగా మారిందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 2019- 20 సంవత్సరానికి 250 కోట్ల విలువైన టిడిఅర్ సర్టిఫికెట్ల అమ్మకం జరిగింది. ఈ కార్యక్రమం వలన స్థానిక సంస్థల పైన ఆర్థిక భారం పడకపోవడంతో ఆస్తుల సేకరణ మరింత సులభం

కరోనా కట్టడిలో పురపాలక శాఖ పాత్ర...

రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న వేల పురపాలక శాఖ దాని కట్టడి చేయడానికి కీలక పాత్ర పోషించిందని అన్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇతర శాఖలతో పురపాలక శాఖ సమన్వయం చేసుకొని పని చేసింది. 60 రోజుల లాక్ డౌన్ కాలంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఇంజనీరింగ్ పూర్తి చేసిందన్నారు. లాక్ డౌన్ మొదలైన రోజు నుంచి మున్సిపల్ విభాగం పారిశుద్ధ్యం, విపత్తు సహాయక నిర్వహణ, నీటి సరఫరా వంటి అంశాల విషయంలో 24 గంటల పాటు పని చేసింది.

మరోవైపు ఈ సంక్షోభాన్ని అవకాశంగా వాడుకున్న పురపాలక శాఖ హైదరాబాద్ లాంటి పట్టణాల్లో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి ఇంజనీరింగ్ పనులను వేగంగా పూర్తి చేసింది. దీంతో పాటు సుమారు లక్షా 25 వేల మందికి ఉచిత భోజనాన్ని అందించిందన్నారు. నూతన పురపాలక చట్టం 2019ని రాష్ట్రంలోని పురపాలికల్లో సమగ్రమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. నూతన పురపాలికలను తెలంగాణలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పరిపాలనను మరింతగా వికేంద్రీకరించే లక్ష్యంతో రాష్ట్రంలో అనేక నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది.

పట్టణ రోడ్లకు మహర్దశ పురపాలక శాఖ తన పరిధిలోని పట్టణాల్లో రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపట్టింది. టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా ఇచ్చిన ప్రత్యేక నిధులను ప్రతి పట్టణంలో ప్రధాన రోడ్లపైన ఖర్చు చేసేలా ఇంజనీరింగ్ శాఖ ద్వారా చర్యలు చేపట్టింది. టీఎస్ బి పాస్ ప్రస్తుతం హైదరాబాద్ జిహెచ్ఎంసి మరియు హెచ్ఎండిఏ లాంటి చోట్ల dpms విధానంలో ఇస్తున్న బిల్డింగ్ అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు పురపాలక శాక ప్రయత్నాలు ప్రారంభించింది.

మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేసింది. ఇందులో 2020 ఫిబ్రవరి నాటికి సుమారు 4 లక్షల మంది రోజువారీగా ప్రయాణం చేస్తూ రద్దీ అయినా మెట్రోల్లో ఒకటిగా నిలిచింది పట్టణ పేదలకు బస్తీ దవాఖానా భరోసా పేదలకు ఆరోగ్యాన్ని అందించేందుకు పురపాలక శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటిదాకా ఉన్న 123 బస్తీదవాఖాణాలకు మరో 45 దవాఖానాలను ఒకేరోజు ప్రారంబించింది.

పట్టణ ప్రజల దాహార్తి పురపాలక తీర్చింది. పట్టణాల్లో తాగునీటికి ఆటంకాలు లేకుండా మంచినీటి సరఫరా చేసినట్టు పురపాలక శాఖ తన నివేదికలో పేర్కొంది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా కోవిడ్ సంక్షోభం సందర్భంగా మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తి చేసింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర విభాగాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories