బ‌స్తీ ద‌వాఖాన‌ల‌పై కేటీఆర్ అద్భుతమైన ట్వీట్...

బ‌స్తీ ద‌వాఖాన‌ల‌పై కేటీఆర్ అద్భుతమైన ట్వీట్...
x
Highlights

బస్తీల్లో ఉండే పేద ప్రజలకు వైద్య సదుపాయాలను అందించేందు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

బస్తీల్లో ఉండే పేద ప్రజలకు వైద్య సదుపాయాలను అందించేందు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బస్తీ దవాఖానలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. పేద ప్రజలు ఆ బస్తీదవఖానాల్లో మెరుగైన చికిత్స చేయించుకోవడం మాత్రమే కాదు, అవసరమైన రక్తపరీక్షలు చేయించుకోగలుగుతున్నారు.

నిరుపేదల్లో ప్రతి ఒక్కరికి చక్కటి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రుల్లో ప్రభుత్వం అనుకున్నట్టుగానే ప్రతి ఒక్క పేదవారికి ఉచిత వైద్య సేవలు, మందులు, పలు రకాల రక్త, మూత్ర పరీక్షలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇంత ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న ఈ బస్తీ దవాఖానలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆయన ట్విటర్ అకౌంట్ లో ట్వీట్ చేసారు. నగర వ్యాప్తంగా 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ దవాఖానల్లో లక్షలాది మందికి ఉచిత కన్సల్టేషన్‌, మందులు, టీకాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో 168 బస్తీ దవాఖానలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories