తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో వచ్చే ఏడాది 'బయో ఆసియా-2020' 17వ అంతర్జాతీయ సదస్సులను నిర్వహించనున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్...
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో వచ్చే ఏడాది 'బయో ఆసియా-2020' 17వ అంతర్జాతీయ సదస్సులను నిర్వహించనున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సను ఫిబ్రవరి 17-20 మధ్య నిర్వహిస్తామని తెలిపారు. బయో ఆసియా-2020 సదస్సు నిర్వహణలో భాగస్వామ్యానికి లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో వ్యాపార విధానాలు, సాంకేతిక పరిజ్ఞానంపై పరస్పరం దేశాలు సహకారం అందించుకోవడానికి కావలసినటువంటి ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయని తెలిపారు. ఈ ఒప్పంద కార్యక్రమం కేటీఆర్ సమక్షంలో నిర్వహించారు.
స్విట్జర్లాండ్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ సిల్వనా రెంగ్లీ ఫ్రే, తెలంగాణ అధికారుల మధ్య సంతకాలు చేశారని కేటీఆర్ తెలిపారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందని ఆయన తెలిపారు. ఈ లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రధాన కేంద్రంగా తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది జరగబోయే ఈ సదస్సులో 50 దేశాలకు చెందిన 2 వేల మంది జీవశాస్త్ర నిపుణులు, ఫార్మా సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని ఆయన తెలిపారు. అనంతరం పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ మాట్లాడుతూ ఈ సదస్సును 'టుడే ఫర్ టుమారో' నినాదంతో నిర్వహిస్తామని తెలిపారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire