మృతదేహాలకు కరోనా టెస్ట్‌లు చేయండి: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..

మృతదేహాలకు కరోనా టెస్ట్‌లు చేయండి: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
x
Highlights

మృతదేహాలకు కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మృత దేహాలకు టెస్టులు చేయాల్సిన అవసరం లేదని గతంలో ప్రభుత్వం...

మృతదేహాలకు కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మృత దేహాలకు టెస్టులు చేయాల్సిన అవసరం లేదని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టెస్ట్‌లు చేయకపోతే కేసులు థర్డ్ స్టేజీకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు.

నెల్లూరు, కర్నూలు పట్టణాల్లో వ్యాధిగ్రస్తులు చనిపోయిన తరువాత పరీక్షలు నిర్వహిస్తేనే కరోనా బయటపడిందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ప్రభుత్వం సమర్పించిన నివేదిక పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. WHO తో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతున్నారో సమ్పర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 26 వరకు మరో స్పష్టమైన నివేదిక అందివ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కు హైకోర్టు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories