నేడు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష

నేడు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష
x
Etela Rajender (file photo)
Highlights

రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని మట్టుపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం 10 గంటలకు...

రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని మట్టుపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆ శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మంత్రి, అధికారులు రాజధాని హైదరాబాద్ తోపాటు సరిహద్దు జిల్లాల్లో కరోనా పరీక్షల నిర్వహణపై చర్చించనున్నారు.

ప్రస్తుతం పెరుగుతున్న కేసులను చూసుకుంటే కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే అందరికి వైద్యం అందించడం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రైవేట్ ల్యాబ్ ల్లో కరోనా పరీక్షల ఫీజులపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఈ సమస్య మరింత జఠిలం కాక మునుపై ముందస్తు చర్యల్లో భాగంగా మరిన్ని జాగ్రత్తలనుతీసుకునే దిశగా చర్చించనున్నారు. ఇక ఈ కరోనా రక్కసి రాజధాని నగరంపై కోరలు చాస్తూ ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి అధిక కేసులను పెంచుతూ పోతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories