దిశ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

దిశ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
x
Highlights

దిశ కేసులో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది....

దిశ కేసులో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది. ప్రభుత్వం తరపున హై కోర్టుకు లా సెక్రటరీ లేఖ రాశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుపై హైకోర్టు ఈ సాయంత్రం నిర్ణయం తెలుపనుంది.

దేశాన్ని కుదిపేసిన దిశ హత్యాచార ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. కౄర మృగాలను వెంటనే ఉరి తీయాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఇంకా ఎంతమంది నిర్భయలు, దిశలు బలి కావాలంటూ విద్యార్థినిలు, మహిళా సంఘాలు మండిపడ్డాయి. దిశ అత్యాచారం, హత్యపై నిరసనలు, ధర్నాలతో తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లుతున్నాయి. దిశ హత్య కేసు నిందితులను వెంటనే ఉరి తీయాలని కోరుతూ ఉద్యమాలు ఊపందుకున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories