తెలంగాణకు కేంద్ర బలగాలు ఏవీ రాలేదు : డీజీపీ మహేందర్ రెడ్డి

తెలంగాణకు కేంద్ర బలగాలు ఏవీ రాలేదు : డీజీపీ మహేందర్ రెడ్డి
x
Highlights

కరోనా నేపద్యంలో తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తున్నాయంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు కేంద్ర బలగాలు కావాలని...

కరోనా నేపద్యంలో తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తున్నాయంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు కేంద్ర బలగాలు కావాలని కోరలేదని, ఆ అవసరం కూడా లేదని తెలిపారు. కాగా, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా నేపథ్యంలో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. దోమలగూడ, బౌద్ధనగర్, సికింద్రాబాద్‌, చందానగర్, కోకాపేట, మణికొండ ప్రాంతాల్లో ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎమ్‌లు అనారోగ్యంతో ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories