తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్...

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్...
x
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. శనివారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. శనివారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం శాసనసభలో తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2020-21ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన రైతు రుణమాఫీ అమలుపై బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.25వేల లోపు ఉన్న రైతుల రుణాలను ఈ నెలలోనే మాఫీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపుగా రూ. 25 వేలు రుణాలున్న రైతులు 5 లక్షల 83 వేల 916 మంది ఉన్నారని తెలిపారు. వారందరి రుణాలను నూటికి నూరు శాతం ఒకే దఫా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

టీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఆచరణకు సాధ్యమైన హామీలనే ఇస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు అమలు చేస్తున్నది. రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ రుణమాఫీ హామీ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని తెలిపారు. రైతు రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం రూ.1,198 కోట్లను విడుదల చేస్తుందని తెలిపారు. రైతుల రుణాలను మాఫీ చేయడానికి గాను ప్రతీ రైతుకు వ్యక్తిగతంగా, చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.

దాంతో పాటుగానే రాష్ట్రంలో రూ.25వేల నుంచి లక్షలోపు రుణాలు రూ.24,738 కోట్లుగా ఉందని తెలిపారు. ఈ రుణాల మాఫీని కూడా వ్యక్తిగతంగా, చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా నాలుగు విడతలుగా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది రైతు రుణమాఫీ కోసం 6,225 కోట్లను ప్రతిపాదించినట్లు మంత్రి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories