పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేస్తాం.. త్వరలో భేటి కూడా

పవన్ కళ్యాణ్ తో  కలిసి పని చేస్తాం.. త్వరలో భేటి కూడా
x
Highlights

తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేస్తామని తెలిపారు. అంతేకాకుండా...

తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేస్తామని తెలిపారు. అంతేకాకుండా త్వరలో భేటి కూడా కానున్నామని వెల్లిడించారు. ఇప్పటికే పవన్ తో కూడా ఫోన్ లో ఇదే విషయంపై చర్చించమని అయన పేర్కొన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కలిసి పనిచేయడానికి జనసేన అవగాహన కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లక్ష్మణ్ చేసిన వాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

తెలంగాణాలో ఈ నెల 24 న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మున్సిపాలిటీల్లో ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్ ఈ వాఖ్యలు చేశారు. ఇక అధికార పార్టీపై లక్ష్మణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వంద సీట్లు గెలిచినప్పటికి ఆ పార్టీకి అధికార దాహం తీరలేదని అన్నారు. మెజార్టీ లేకపోయినా దొడ్డి దారిలో టీఆర్‌ఎస్ ఛైర్మన్ పదవులను దక్కించుకుందని మండిపడ్డారు..ఇక తుక్కుగూడ ఎన్నిక పైన న్యాయ పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.

తుక్కుగూడ పురపాలికలో మొత్తం 15 వార్డులకి గాను బీజేపీ 9 వార్డులు కైవసం చేసుకుంది. ఓ ఇండిపెండెంట్‌ కూడా మద్దతు తెలిపారు. కానీ బీజేపీ ఛైర్మన్‌ పదవి పొందలేకపోయింది. అధికార పార్టీ పుర పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎక్స్‌అఫీనియో అస్త్రాన్ని ప్రయోగించింది. స్వతంత్ర అభ్యర్థి మధుమోహన్‌ను ఛైర్మన్‌గా ఎన్నుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రి సబితాఇండ్రారెడ్డి కీలకపాత్ర పోషించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories