విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
x
రోడ్డు ప్రమాదం
Highlights

మహబూబ్‌నగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జడ్చర్ల మండలం నసురుల్లాబాద్‌ వద్ద ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ...

మహబూబ్‌నగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జడ్చర్ల మండలం నసురుల్లాబాద్‌ వద్ద ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. మృతులు భూత్పూర్‌ మండలం మద్దిగట్ల వాసులుగా గుర్తించారు. మృతులను శంకర్‌, నరేశ్‌, మేఘవర్షిణి, జ్యోతిగా గుర్తించారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories