ఆ ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి తలసాని ఫిర్యాదు

ఆ ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి తలసాని ఫిర్యాదు
x
Highlights

తాజాగా బోనాల వేడుకలలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్సాహంతో డ్యాన్స్ చేసిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో...

తాజాగా బోనాల వేడుకలలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్సాహంతో డ్యాన్స్ చేసిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో యమజోష్‌తో స్టేప్పులు వేస్తూ కనిపిచారు. ఆ వీడియో మందుబాబులం అనే పాటతో అనే పాటతో వైరల్ అయింది. దీంతో ఈ వీడియోపై సోషల్ మీడియాలో చిన్నపాటి దూమారమే రేగింది. బోనాల జాతరలో మంత్రి ఫుల్లుగా మద్యం సేవించి డ్యాన్స్ చేశారని కొందరు నెటిజెన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

అసలు తనకు మందుకొట్టే అలావాటు లేనే లేదని... తాను ప్రతిఏటా బోనాల జాతరలో డ్యాన్స్ చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రతిఏటా లాగే ఈ ఎడాది కూడా తాను డ్యాను చేశానని అన్నారు. ఆడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై మంత్రి తలసాని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మంత్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories