Telangana: హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

Telangana: హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
x
Highlights

ఆస్పత్రుల్లో మృతిచెందిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు చేసే విషయంలో ప్రభుత్వం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే.

ఆస్పత్రుల్లో మృతిచెందిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు చేసే విషయంలో ప్రభుత్వం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేఫథ్యంలోనే మే 18, 26వ తేదీల్లో హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ఉత్తర్వులను జారీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా కోర్టును మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన హైకోర్టు అరకొర సమాచారంతో కోర్టును మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే ఎలాగని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా బుధవారం రోజున విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులను కూడా జారీ చేసింది.

ఇకపోతే కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయట్లేదని ఏజీ ప్రశ్నించగా, హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని స్పష్టం చేసారు. దీంతో స్పందించిన ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనంత వరకు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ వైఖరి ఇదే తీరులో కొనసాగితే వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్లపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

గత సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించకపోవడం, పీపీఈ కిట్లు ఇవ్వకపోవడం, మృతదేహాలకు పరీక్షలు మొదలైన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే వైద్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రావు భారత వైద్య పరిశోధన మండలి నిబంధనల ప్రకారం మృతదేహాలకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతొ స్పందించిన ధర్మాసనం ఒకవేల మృతుడికి కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలితే వారి కుటుంబసభ్యులకు పరీక్షలు చేయొచ్చు కదా అని ప్రశ్నించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories