ఆకాశ వీధిలో... విందు భోజనం

ఆకాశ వీధిలో... విందు భోజనం
x
Highlights

చల్లగాలిలో, కాండిల్ లైట్ లో గాల్లో తేలుతూ భోజనం చేస్తే ఎలా వుంటుంది. ఒక్కసారి ఊహించుకోండి... ఆ ఆలోచన వస్తేనే ఎదో థ్రిల్లింగ్ గా వుంది కదా.

చల్లగాలిలో, కాండిల్ లైట్ లో గాల్లో తేలుతూ భోజనం చేస్తే ఎలా వుంటుంది. ఒక్కసారి ఊహించుకోండి... ఆ ఆలోచన వస్తేనే ఎదో థ్రిల్లింగ్ గా వుంది కదా. ఇప్పుడు ఆ ఆలోచన నిజం కాబోతుంది. అది ఎలాగంటారా దేశంలోనే రెండో స్కై డైనింగ్‌ రెస్టారెంట్‌ మన హైదరాబాద్ నగరంలో కొలువు దీరింది. గాల్లో తేలుతూ నోరూరించే రుచులతో వినూత్న అనుభవాన్ని నగర వాసులు చూడబోతున్నారు. ఈ స్కై డైనింగ్‌ రెస్టారెంట్‌ పూర్తి వివరాలను రెస్టారెంట్‌ రూపకర్తలు, క్లౌడ్‌ డైనింగ్‌ రెస్టారెంట్స్‌ డైరెక్టర్లు దేవిదత్‌ కొలి, తరుణ్‌ కొలి తెలిపారు.

హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా రెస్టారెంట్‌ నెలకొల్పామని, క్రేన్ల సహాయంతో అతిథులను 160 అడుగుల ఎత్తుకు తీసుకెల్లే ఏర్పాటు చేసామని తెలిపారు. ఈ రెస్టారెంట్‌ను 2 నవంబర్ ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. నోయిడాలో తొలి రెస్టారెంట్‌ నెలకొల్పామని చెప్పారు. ఈ రెస్టారెంట్లోకి 14 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉండదని, ఈ రెస్టారెంట్‌లోకి ప్రవేశం కోసం ఒక్కొక్కరికీ రూ.4,999 కట్టాలని వారు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories