ఎంపీడీవో అరాచకం.... అదనపు కట్నం కోసం భార్యపై హత్యాయత్నం

ఎంపీడీవో అరాచకం.... అదనపు కట్నం కోసం భార్యపై హత్యాయత్నం
x
ఎంపీడీవో అరాచకం
Highlights

ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ ఎంపీడీవో అరాచకంగా ప్రవర్తించాడు. అదనపు కట్నం కోసం తన భార్యపైనే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎంపీడీవో జగదీశ్‌ అనిల్ కుమార్...

ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ ఎంపీడీవో అరాచకంగా ప్రవర్తించాడు. అదనపు కట్నం కోసం తన భార్యపైనే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎంపీడీవో జగదీశ్‌ అనిల్ కుమార్ తాగిన మైకంలో తనను వేధిస్తున్నాడని భార్య మేరీ కుమారి జిల్లా ఎస్పీ మల్లారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. కత్తితో దాడి చేసి చేతులు, ఇతర శరీర భాగాల్లో గాయపర్చారంటూ కంప్లైంట్‌లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జగదీశ్‌ అనిల్‌కుమార్‌, గుంటూరు వాసి మేరీకుమారితో 2018లో వివాహమైంది. ప్రస్తుతం అనిల్‌కుమార్‌ కుమురం భీ అసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి) ఎంపీడీవోగా పనిచేస్తున్నాడు. కాగజ్‌నగర్‌లోని శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసముంటున్నారు. అదనపు కట్నం కోసం గతంలోనూ తనపై హత్యయత్నం జరిగిందని మేరీకుమారి చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories