ఏడేళ్ల క్రితం కిడ్నాప్‌కు గురైన సంతోష్‌కుమార్‌

ఏడేళ్ల క్రితం కిడ్నాప్‌కు గురైన సంతోష్‌కుమార్‌
x
Highlights

ఏడేళ్లక్రితం కనిపించకుండాపోయాడు. కన్నబిడ్డపై మమకారం చావలేదు. ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియని బిడ్డ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది ఆతల్లి. కొడుకు...

ఏడేళ్లక్రితం కనిపించకుండాపోయాడు. కన్నబిడ్డపై మమకారం చావలేదు. ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియని బిడ్డ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది ఆతల్లి. కొడుకు జ్ఞాపకాలతో రోజులు , సంవత్సరాలు గడుపుతోంది. చిన్నప్పడు బుడ్డుడో చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోతుంది. పేగు బంధం దూరమైనా కనిపించని బిడ్డ కోసం ప్రతి ఏటా పుట్టిన రోజు వేడుకులు జరుపుకుంటున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో వెలుగుచూసింది.

ప్రకాశం జిల్లా మర్టూరు గ్రామానికి చెందిన నరేష్‌, వనజ దంపతులు బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితం శంషాబాద్‌కు వచ్చారు. పెయింటర్‌గా పనిచేస్తున్న నరేష్‌కు ఒకపాప ఒక కొడుకు ఉన్నారు. 2012 ఏప్రిల్ 17న కూతురు, కొడుకు స్కూల్‌ వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి బాబును బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిపోయాడని అప్పటి నుంచి ఇప్పటి వరకు బిడ్డ రాక కోసం ఆ తల్లి ఆరాటపడుతోంది.

ఏళ్లతరబడి కుమారుడి రాక కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లి బిడ్డ తమ దగ్గర లేకపోయినా బర్త్‌డే వేడుకలను జరుపుకుంటుంది. దూరమైన తమ బిడ్డను దయచేసి నా దగ్గరకు పంపండి అంటూ ధీనంగా వేడుకుంటోంది. నాలుగైదు రోజుల్లో బిడ్డ ఆచూకీ తెలుసుకుంటామని చెప్పిన పోలీసులు ఇప్పటి వరకు బాబు గురించి ఎందుకు చెప్పడం లేదంటూ కన్నీరు పెట్టుకుంటుంది. బిడ్డ వివరాల కోసం చెప్పులు అరిగేలా పోలీస్‌ స్టేషన్‌ చుట్టు తిరుగుతున్నా కరుణించడం లేదని కన్నీటిపర్యంతమవుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories