ప్రిన్సిపాల్ వికృత చేష్టలు.. మహిళా ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులు

ప్రిన్సిపాల్ వికృత చేష్టలు.. మహిళా ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులు
x
Highlights

విద్యార్థులకు బుద్దులు చెప్పాల్సిన ప్రిన్సిపాల్ వక్రమార్గం పట్టాడు. పాఠాలు భోదిస్తున్న ఓ మహిళా టీచర్ పై వికృత చేష్టలతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు....

విద్యార్థులకు బుద్దులు చెప్పాల్సిన ప్రిన్సిపాల్ వక్రమార్గం పట్టాడు. పాఠాలు భోదిస్తున్న ఓ మహిళా టీచర్ పై వికృత చేష్టలతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తనకు లొంగని ఉపాధ్యాయురాలిపై చేయి చేసుకున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నారంటూ నిలదీసిన పాపానికి అసభ్యపదజాలంతో దుర్భాషలాడరంటూ బాధిత ఉపాధ్యాయురాలు ఆరోపిస్తోంది.

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సైపూల్లాఖాన్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కొంత కాలంగా మహిళా ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. పాఠశాల వేళలు ముగిసిన తర్వాత కూడా రాత్రి ఏడు గంటల వరకు ఉండాలంటూ వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధిత ఉపాధ్యాయురాలు చెబుతుంది. విద్యార్ధుల ముందే కర్రతో కొట్టారని చెబుతుంది. తీవ్ర అవమానానికి గురైన సదరు ఉపాధ్యాయురాలు ప్రిన్సిపాల్ ఆగడాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

మరో వైపు ప్రిన్సిపాల్ ఆగడాలపై జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ సీరియస్ అయ్యారు. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ట్రైనీ కలెక్టర్ అభిలాష, డీఈఓ రవీందర్‌ను విచారణాధికారులుగా నియమించారు. విద్యార్ధుల నుంచి వివరాలు సేకరించారు. అయితే టీచర్ పై దాడి చేయలేదని పిల్లలను కొడుతుండగా టీచర్ కు తగిలిందని ప్రిన్సిపాల్ సైఫుల్లాఖాన్ చెబుతున్నారు.

క్రమశిక్షణ నేర్పించాల్సిన ప్రిన్సిపాలే పక్కదారిపట్టడం పట్ల మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళా ఉపాధ్యాయురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ సైపుల్లాఖాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories