ఎన్నికల ప్రచారంలో సత్యవతి రాథోడ్

ఎన్నికల ప్రచారంలో సత్యవతి రాథోడ్
x
మంత్రి సత్యవతి రాథోడ్ (ఫైల్ ఫోటో)
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ను ఎంతో ఆదరిస్తున్నారని శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ను ఎంతో ఆదరిస్తున్నారని శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు మంత్రి ఇల్లందు లోని పలు వార్డులలో టిఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి తమ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులలో అభ్యర్థుల విజయానికి కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్లి ఓటు అడగడం జరిగింది అన్నారు.

ఏ ఇంటికి వెళ్లిన కారు గుర్తుకే మన ఓటు అని తమకు బొట్టు పెట్టి ప్రజలు హామీ ఇస్తున్నారు అన్నారు. గతంలో అంటే ఇల్లందు పట్టణం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధిని సాధించిందని తెలిపారు. 121 కోట్ల రూపాయల అభివృద్ధిని సాధించిపెట్టిన ఘనత టిఆర్ఎస్ పార్టీ ది అని చెప్పారు, ఇల్లందు పట్టణం ఇంత అభివృద్ధి కావడానికి కెసిఆర్, యువ నాయకుడైన కేటీఆర్ వల్లనే సాధ్యం అయిందని ధీమా వ్యక్తం చేశారు. ఇల్లందు పట్టణం మరింత అభివృద్ధి కావాలన్న ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను టీఆర్ఎస్ కు పట్టం కట్టాలని , ప్రతిపక్ష అభ్యర్థులు పార్టీలు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories