పోడు భూమి రైతులకు రైతుబంధు వచ్చేలా చేస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

పోడు భూమి రైతులకు రైతుబంధు వచ్చేలా చేస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్
x
Highlights

పోడుభూముల రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని డీఎస్ఎస్ భవన్ లో గిరిజన ఆరో సలహా మండలి సమావేశం నిర్వహించారు.

పోడుభూముల రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని డీఎస్ఎస్ భవన్ లో గిరిజన ఆరో సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోడు భూమి రైతులకు రైతు బంధు వర్తించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. అదే విధంగా పోడు భూముల సమస్యలు తీరుస్తామని, ఆ విషయాన్ని సీఎం కేసీర్ దృష్టికి తీసుకెళ్లి వాటి నిర్మాణం కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు.

గిరిజన రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆమె అన్నారు. సింగరేణిలో బాక్ లాక్ పోస్టులు, భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాల కల్పన విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతే కాకుండా గిరిజనులకు సమస్యలపై త్వరలో ప్రధానిని కలుస్తామన్నారు.

గిరిజన ఆవాసాలకు త్రీ ఫేస్ కరెంట్ లేదని ఆమె అన్నారు. కొన్ని గ్రామాలకు పూర్తిగా కరంట్ లేకపోవడం దురదృష్టకరమని ఆమె తెలిపారు. ఈ విషయంపై వచ్చే బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించే విధంగా ఆమె ప్రయత్నిస్తామని తెలిపారు.

గిరిజనల కోసం గురుకులాలు, కాలేజీలు పెంచాలని సభ్యులు కోరినట్లు వెల్లడించారు. గిరిజనులకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయడంపై చర్చించామని అన్నారు. గిరిజన సలహా మండలి సూచనలు, సలహాలు కచ్చితంగా పాటించేలా చూస్తామని ఆమె అన్నారు. కొంతమందికి జీతాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సరైన న్యాయం చేస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories