మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఆర్టీసీ కార్మికుల నిరసనసెగ

మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఆర్టీసీ కార్మికుల నిరసనసెగ
x
Highlights

భద్రాచలంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. శ్రీసీతారామ చంద్ర స్వామి దర్శనానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ట్రైబల్‌ వెల్ఫేర్‌ మంత్రి సత్యవతి రాథోడ్‌ను...

భద్రాచలంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. శ్రీసీతారామ చంద్ర స్వామి దర్శనానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ట్రైబల్‌ వెల్ఫేర్‌ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి కాన్వాయ్‌ను పోలీసులు దారి మళ్లించారు. భద్రాద్రి రాములవారి పర్యటనకు వెళ్లిన మంత్రి కారుకు కార్మికులు అడ్డుగా పడుకున్నారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి కారుకు అడ్డంగా ఉన్న కార్మికులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories