విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి
x
రాజేందర్‌
Highlights

నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం మంగళపాడులో విషాదం చోటు చేసుకుంది. కర్ణం రాజేందర్‌ అనే ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్టీసీ సమ్మె...

నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం మంగళపాడులో విషాదం చోటు చేసుకుంది. కర్ణం రాజేందర్‌ అనే ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా గత కొన్ని రోజులుగా ఆయన తీవ్రమనస్థాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం గుండెపోటు రావడంతో రాజేందర్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

తెలంగాణలోని ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమ్మె విరమణతో జేఏసీ పిలుపు మేరకు విధుల్లో చేరేందుకు డిపోలకు తరలివస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలు లేకుండా చేర్చుకోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డిపోల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories