ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్రయాణీకులపైకి దూసుకెళ్లిన బస్సు

ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్రయాణీకులపైకి దూసుకెళ్లిన బస్సు
x
Highlights

నల్గొండ జిల్లా మిర్యాలగూడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రయాణీకులపైకి దూసుకుపోయింది. తాత్కాలిక డ్రైవర్‌...

నల్గొండ జిల్లా మిర్యాలగూడ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్‌ కోసం ఎదురుచూస్తున్న ప్రయాణీకులపైకి దూసుకుపోయింది. తాత్కాలిక డ్రైవర్‌ నడుపుతున్న బస్సు ప్లాట్‌ ఫామ్‌ దగ్గరకు రాగానే అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అదే బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జానయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జానయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సరైన శిక్షణ, నైపుణ్యం లేని వారిని విధుల్లోకి తీసుకోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories