మాస్కు లేని వ్యక్తికి మద్యం అమ్మకం.. రూ. 5వేల జరిమానా..

మాస్కు లేని వ్యక్తికి మద్యం అమ్మకం.. రూ. 5వేల జరిమానా..
x
Highlights

తెలంగాణలో లాక్‌డౌన్ మే 29 వరకు పొడిగిస్తూ సీఎం కేేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ విధించడంతో పాటు కొన్ని సడలింపులు ఇచ్చారు. అయితే...

తెలంగాణలో లాక్‌డౌన్ మే 29 వరకు పొడిగిస్తూ సీఎం కేేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ విధించడంతో పాటు కొన్ని సడలింపులు ఇచ్చారు. అయితే లాక్ డౌన్ అమలును అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కొరడా ఝులిపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్లికార్జున వైన్స్‌కు మాస్కు ధరించకుండా వచ్చిన ఓ వ్యక్తికి మద్యం విక్రయించారు. దీంతో పురపాలక కమిషనర్‌ మద్యం దుకాణానికి రూ. ఐదు వేలు జరిమానా విధించారు. మాస్క్లులు ధరించిన వ్యక్తులకే మద్యం విక్రయించాలని లేకుంటే జరిమానా విధిస్తామని పురపాలక కమిషనర్ సమ్మయ్య హెచ్చరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories