జాతరకి వెళ్లి వచ్చే లోపు ఇల్లు గుల్ల

జాతరకి వెళ్లి వచ్చే లోపు ఇల్లు గుల్ల
x
Highlights

మేడారం సమ్మక్క- సారక్క జాతరకి అని వెళ్లి వచ్చే లోపే దొంగలు ఇల్లును గుల్ల చేశారు. ఈ ఘటన అల్వాల్‌ ఠాణాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే...

మేడారం సమ్మక్క- సారక్క జాతరకి అని వెళ్లి వచ్చే లోపే దొంగలు ఇల్లును గుల్ల చేశారు. ఈ ఘటన అల్వాల్‌ ఠాణాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మచ్చబొల్లారంలోని కృష్ణానగర్‌లో బాలయ్య అనే రిటైర్ ఉద్యోగి తన కుమారులతో కలిసి రెండు అంతస్తుల భవనంలో ఉంటున్నాడు. కింది పోర్షన్ లో తను ఉండగా, పైన రెండు పోర్షన్ లలో తన ఇద్దరు కుమారులు ఉంటున్నారు.

అయితే కుటుంబం మొత్తం కలిసి జనవరి 30న మేడారం జాతరకి వెళ్లారు. తిరిగి ఆదివారం ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దొంగతనం జరిగిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. 82 తులాల బంగారు, 80 తులాల వెండి నగలు, రూ.2లక్షల దోచుకెళ్ళినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం సీఐ యాదగిరి పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories