బస్సు స్లో చేసి వెంటనే వేగం పెంచడంతో కింద పడిపోయిన విద్యార్థిని.. తీవ్రగాయాలు..

బస్సు స్లో చేసి వెంటనే వేగం పెంచడంతో కింద పడిపోయిన విద్యార్థిని.. తీవ్రగాయాలు..
x
Highlights

ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో బస్సు ఎక్కే క్రమంలో విద్యార్థిని కింద పడింది. ఆమె కాలుపై నుంచి ముందు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయాలయ్యాయి.

ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో బస్సు ఎక్కే క్రమంలో విద్యార్థిని కింద పడింది. ఆమె కాలుపై నుంచి ముందు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రతీ రోజు కొయ్యలగూడెం స్టాప్‌లో బస్సు ఆపి విద్యార్థులు ఎక్కుతుంటారు. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ స్లో చేసి వెంటనే వేగం పెంచడంతో డిగ్రీ విద్యార్థిని కీర్తి అదుపు తప్పి కింద పడిపోయింది. బస్సు చక్రం ఎక్కి ఆమె కాలు తీవ్రంగా దెబ్బతినడంతో చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories