మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
x
Highlights

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా సుమారు 20 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి...

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా సుమారు 20 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామం నుంచి పలువురు గ్రామస్థులు ఏడుపాయలకు ఓ శుభకార్యం కోసం డీసీఎం వ్యాన్‌లో బయల్దేరి వెళ్లారు. మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొల్చారం మండలం సంగయ్యపేట వద్దకు రాగానే డీసీఎంను ఢీకొట్టింది.

ఈ ఘటనలో డీసీఎంలో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. దీంతో గాయపడ్డవారిని హుటాహుటిన 108లో మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారమందుకున్న ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులను మధురిమ (7), గుడాల మానమ్మ, లక్ష్మి, గుడాల దుర్గమ్మ, రజితగా గుర్తించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories