ఒకే వేదికపై కేసీఆర్,రేవంత్

ఒకే వేదికపై కేసీఆర్,రేవంత్
x
ఒకే వేదికపై కేసీఆర్,రేవంత్
Highlights

సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే ఈ ఇద్దరు నేతలు ఒకే వేదిక పంచుకోనున్నారు. సీఎం కేసీఆర్‌, ఎంపీ...

సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అయితే ఈ ఇద్దరు నేతలు ఒకే వేదిక పంచుకోనున్నారు. సీఎం కేసీఆర్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి ఒకే వేదికపై కన్పించనున్నారు. ఎంజీబీఎస్‌లో సభ నిర్వహించనున్నారు. సభకు ఇరు పార్టీల నేతలు జనసమీకరణ చేస్తున్నారు. జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో రూట్ ఓపెనింగ్ సందర్భంగా మల్కాజ్‌గిరి పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ అసెంబ్లీ ఏరియా పరిధిలో సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఎంపీ రేవంత్‌రెడ్డి.

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన ఘట్టం చోటుచేసుకోనుంది. అత్యంత రద్ధీగా ఉన్న రూట్లో ఎట్టకేలకు మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మధ్య మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్‌ నేడు సాయంత్రం సర్వీసులను ప్రారంభించనున్నారు. జేబీఎస్ – ఎంజీబీఎస్ రూటు అందుబాటు లోకి వస్తే నగరం లో ట్రాఫిక్ కష్టాలు తగ్గడం తో పాటు దేశంలో రెండో పెద్ద మెట్రో గా హైదరాబాద్ మెట్రో రైల్ రికార్డ్ సృష్టించనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories