ఏసీబీ కోర్టుకు రేవంత్‌ రెడ్డి

ఏసీబీ కోర్టుకు రేవంత్‌ రెడ్డి
x
రేవంత్ రెడ్డి
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో తెలంగాణలో ఏ1, కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌ రెడ్డి ఇవాళ ఏసిబి కోర్టుకు హాజరయ్యారు. 2015 లో మొదలయిన ఈ కేసు...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో తెలంగాణలో ఏ1, కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌ రెడ్డి ఇవాళ ఏసిబి కోర్టుకు హాజరయ్యారు. 2015 లో మొదలయిన ఈ కేసు ఒక్క సారిగా తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. కాగా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ను తమ వైపునకు ఆకర్షించేందుకు 50 లక్షల రూపాయలు ఇస్తూ రేవంత్‌ రెడ్డి కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో రేవంత్ రెడ్డి స్టీఫెన్‌సన్‌ను కలిసిన వీడియోలు, డబ్బులిచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్టీఫెన్‌సన్‌తో మాజీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడిన ఆడియో ఫుటేజీ కూడా వైరల్ అయ్యింది.

ఈ కేసులోనే రేవంత్ రెడ్డిని ఏసిబి అధికారులు అరెస్టు చేసారు. ఆ తరువాత ఆయన కొన్ని నెలలపాటు జైలులో ఉండి తరువాత బయటికి వచ్చారు. అయితే ఈ కేసులో ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో నిందుతులుగా ఉన్నరేవంత్ రెడ్డి, ఆయనతో పాటు మరికొంత మంది నాయకులు ఈ రోజు ఏసిబి కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories