తుపాకులు పేలుతున్నాయ్‌.. బుల్లెట్లు దూసుకొస్తున్నాయ్‌

తుపాకులు పేలుతున్నాయ్‌.. బుల్లెట్లు దూసుకొస్తున్నాయ్‌
x
Highlights

తెలంగాణలో మరోసారి గన్ పేలింది. సిద్దిపేట సరిహద్దులో ఏకే 47 మోగిన ఘటన, జగిత్యాల కాల్పుల ఘటన మర్చిపోకముందే తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో...

తెలంగాణలో మరోసారి గన్ పేలింది. సిద్దిపేట సరిహద్దులో ఏకే 47 మోగిన ఘటన, జగిత్యాల కాల్పుల ఘటన మర్చిపోకముందే తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. శాయంపేటలో నిన్న రాత్రి ఓ పెళ్లి విందులో తిరుమల్ రెడ్డి అనే వ్యక్తి గన్ తో గాల్లోకి కాల్పులు జరిపాడు. తిరుమల్ రెడ్డి భార్య ప్రస్తుతం శాయంపేట ఉప సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తిరుమల్ రెడ్డి గతం లో ఆర్మీ లో పని చేసినట్లు గుర్తించారు. విచారణ కోసం తిరుమల్ రెడ్డిని పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తరలించారు.

పెద్దపల్లి జిల్లా శాయంపేటలో కాల్పులు జరిపిన తిరుమల్ రెడ్డి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిగా గుర్తించారు. 2017లో తిరుమల్ రెడ్డి జమ్ములో గన్ కొనుగోలు చేశాడు. 12 బోర్ గన్ 31772-15 గా గుర్తించారు. రెండు నెలల క్రితం కాల్పులు జిరిపిన వీడియోగా అనుమానిస్తున్నారు. తిరుమల్ రెడ్డితో పాటు మరో ఐదుగురుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తిరుమల్ రెడ్డి ఇప్పటికి మూడు సార్లు గన్ ఫైర్ చేసినట్లు పోలీసులు చెప్పారు. డబుల్ బ్యారెల్ గన్ స్వాధీనం చేసుకున్నారు. జనవరి ఒకటిన మద్యం మత్తులు కాల్పులు జరిపినట్లుగా గుర్తించారు. గతంలోనూ తుపాకీ కాల్పులు జరిపినట్లు కరీంనగర్ ఏసీపీ రవీందర్ చెప్పారు. ఇలాంటి వాటిపై ఉపేక్షించేది లేదు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అయితే. వరుస ఘటనలతో ఇంటెలీజెన్స్ డిపార్ట్ మెంట్ అప్రమత్తం అయ్యింది. జిల్లాలో మరిన్ని అనధికార తుపాకులు ఉన్నట్లు భావిస్తున్నారు. గతంలోనూ మావోయిస్టులు. జనశక్తిలో తిరిగి లొంగిపోయిన వారి దగ్గర తుపాకులు ఉన్నాయన్న కోణంపైపోలీసులు నజర్ వేశారు. గత ఏడాది సిరిసిల్ల జిల్లాలో లోకల్ మేడ్ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories