భార్యను వివస్త్రను చేసి ఇంటి నుంచి గెంటేసిన భర్త..

భార్యను వివస్త్రను చేసి ఇంటి నుంచి గెంటేసిన భర్త..
x
Highlights

పెళ్లిలో చేసిన ప్రమాణాలకు మరిచిపోయి కొంత మంది వ్యక్తులు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. తాలికట్టిన భార్యనే చిత్రహింసలకు గురి చేస్తున్నారు.

పెళ్లిలో చేసిన ప్రమాణాలకు మరిచిపోయి కొంత మంది వ్యక్తులు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. తాలికట్టిన భార్యనే చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కొడుతూ, తిడుతూ ఆఖరికి చంపేస్తూ నమ్మి వచ్చిన ఆలి గొంతు కోసి వారిని కడతేరుస్తున్నారు. ఇదే కోనంలో ఓ భర్త తన తన పైశాచికత్వాన్ని చూపించాడు. నూరేళ్లు కలిసి కాపురం చేయాల్సిన తన భార్య మీద ద్వేషం పెంచుకుని నలుగురిలో తనని అవమాన పరిచాడు. పదిమంది ముందు ఆమెను వివస్త్రను చేసి ఇంటినుంచి గెంటేసాడు. ఈ ఘటన అక్కడ ఉన్న వారి హృదయాలను కలచివేసింది.

పూర్తివివరాల్లోకెళితే కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ తాగుబోతు భర్త తాలి కట్టి ఏలుకున్నభార్యను నడిరోడ్డు పై కొట్టి వివస్త్రను చేసి బయటికి గెంటేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు ముందు ఆ పైశాచిక భర్త ఆమె ఇష్టం వచ్చినట్టుగా కొట్టి చిత్రహింసలు పెట్టి తరువాత గెంటసాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతని పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కుటుంబ కలహాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ, ఇలా మృగం మాదిరిగా ప్రవర్తించడంపై శివాలెత్తుతున్నారు. ఈ సంఘటన చూసిన చుట్టుపక్కన వారు, ఆమె బంధువులు చలించి పోయి ఆమెకు దుస్తులు అందించారు.

ఆ తరువాత అవమాన భారంతోనే ఆ మహిళ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం విచారించగా ఇతను తన భార్యను రోజూ ఏదో అంశంపై వేధిస్తూ ఉండేవాడని ఇరుగు పొరుగు వారు వెల్లడించారు. ప్రతి రోజు వారి ఇంట్లో గొడవలు వినబడుతూ ఉండేవని తెలిపారు. బాధితురాలు ఇచ్యిన ఫిర్యాదు మేరకు తన ఇంటికి చేరుకున్న పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories